అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: మోదీ
ఎన్నికల వేళ ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆయన గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓటు వేసిన అనంతరం మాట్లాడారు. ‘‘అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎండల్లోనూ ప్రజలు తరలివచ్చి ఓటు వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉంది. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ అని తెలిపారు.