నేటి నుంచి భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు
భారత్-అమెరికా రెండు వారాల పాటు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఉన్న ఫోర్ట్వయిన్రైట్ సైనిక స్థావరంలో యుద్ధ అభ్యాస్-23 పేరిట వీటిని నిర్వహించనున్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత్కు చెందిన 350 మంది సైనిక బృందం ఇప్పటికే అక్కడకు చేరుకుంది. భారత్, అమెరికా ఏటా సంయుక్త సైనిక విన్యాసాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.