రాజస్థాన్-కోల్కతా మధ్య మ్యాచ్.. టాస్ ఆలస్యం
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగనుంది. గుహవాటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ మ్యాచ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ.. అక్కడ వర్షం పడుతుండటంతో ఇంకా టాస్ కూడా వేయలేదు. కాగా.. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. టాస్కు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.