shape

National ChotaNews

Blog Image

తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం

తిరుమలలో మూడురోజుల పాటు నిర్వహించిన పద్మావతి పరిణయోత్సవాలు ఈరోజు సాయంత్రం ఘనంగా ముగిసాయి. చివరి రోజు శ్రీదేవి, భూదేవి వేర్వేరుగా రెండు వాహనాలపై రాగా మలయప్ప స్వామి గరుడ వాహనంపై వేదిక వద్దకు చేరుకున్నారు.ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఎదురుకోలు, పూబంతాట, వరణమయురం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.

Blog Image

పుష్ప పాటకు స్టెప్పేసిన మీనా

90వ దశకంలో టాలీవుడ్‌లో హీరోయిన్ మీనా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌కి కాస్త దూరమైంది. తాజాగా సమ్మర్ వెకేషన్‌లో ఉన్న మీనా పుష్ప పాటకు కాలు కదిపింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Blog Image

పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్‌ ట్యాంకు

TG: భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. డీజిల్‌ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది చాకచక్యంగా మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమయానికి మంటలు అదుపులోకి రాకపోయి ఉంటే.. భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

తాజ్ మహల్ సమీపంలో మృతదేహం లభ్యం

తాజ్ మహల్ సమీపంలోని ఓ మసీదు కాంప్లెక్స్‌లో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. అది పాక్షికంగా నగ్నంగా ఉంది. తాజ్ మహల్ తూర్పు ద్వారం సమీపంలో ఈ మృతదేశం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

Blog Image

కార్పొరేటర్‌ అరెస్టు అప్రజాస్వామికం: కిషన్‌రెడ్డి

TG: బీజేపీ నేత, కార్పొరేటర్‌ శ్రవణ్‌ను ప్రభుత్వం కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరిలో బాధిత కుటుంబాన్ని కిషన్‌రెడ్డి పరామర్శించి.. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం సబబుకాదన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కుమ్మక్కై బీజేపీని అడ్డుకునే కుట్రకు పాల్పడుతున్నాయన్నారు.

Blog Image

ఆకలికి తట్టుకోలేక ఎద్దు ఏం చేసిందంటే?

ఆకలికి తట్టుకోలేక ఓ ఎద్దు మహిళపై దాడి చేసిన ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఓ మహిళ తన స్నేహితులతో కలిసి బీచ్‌లో సరదాగా గడుపుతుంటుంది. అటుగా వచ్చిన ఎద్దు ఆమెకు సంబంధించిన వస్తువుల్లో ఆహారం ఉందేమో అని వెతుకుతూ ఉంటుంది. ఇది గమనించిన ఆమె తన వస్తువులను పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది.దీంతో చిరాకు పడిన ఎద్దు ఒక్కసారిగా ఆమెపై దాడి చేస్తుంది.

Blog Image

అమృత్‌పాల్ సింగ్‌కు మైక్ గుర్తు

పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖలిస్థానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్ సింగ్‌కు ఎన్నికల సంఘం 'మైక్' గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అతను అస్సాంలోని దిబ్రూఘర్ జైలులో ఉన్నాడు. అతనితో పాటు పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు పోటీచేస్తున్న 328 మంది అభ్యర్థులకు ఈసీ గుర్తులు కేటాయించింది.

Blog Image

రాజస్థాన్-కోల్కతా మధ్య మ్యాచ్.. టాస్ ఆలస్యం

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగనుంది. గుహవాటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ మ్యాచ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ.. అక్కడ వర్షం పడుతుండటంతో ఇంకా టాస్ కూడా వేయలేదు. కాగా.. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. టాస్కు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Blog Image

టాటా మోటార్స్‌ కీలక నిర్ణయం

టాటా మోటార్స్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరం (2024-25)లో ఆటోమొబైల్‌ విభాగంలో రూ.43వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సీఎఫ్‌ఓ పీబీ బాలాజీ ఓ సదస్సులో మాట్లాడుతూ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం రూ. 35,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. 2024లో ఈ గ్రూప్‌ దాదాపు రూ. 41,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది.

Blog Image

కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ వెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. అజర్‌బైజాన్ పర్యటనకు వెళ్తుండగా జోల్ఫా సిటీ సమీపంలో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయింది. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపట్టారు.

Blog Image

వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కొందరు వైసీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిచి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తను స్టేషన్‌ నుంచి రాచమల్లు బలవంతంగా తీసుకెళ్లారు. సీఐను బెదిరించి,విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

Blog Image

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

తమిళ స్టార్ హీరో అజిత్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మూవీ తెరక్కుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది.

Blog Image

తిరుపతి జిల్లాలో పిడుగులు.. ఇద్దరు స్పాట్ డెడ్

తిరుపతి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రామ సముద్రం, కృష్ణ సముద్రంలో పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి చెందారు. మరోవైపు వర్షాలు నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వర్షాలు కురుస్తున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.

Blog Image

‘దేవర’ నుంచి ‘ఫియర్ సాంగ్’ వచ్చేసింది

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘దేవర’. ఈ మూవీ నుంచి ‘ఫియర్ సాంగ్’ వచ్చేసింది. ‘దూకే ధైర్యమా నువ్వెంత..’ అంటూ సాగే ఈ సాంగ్ అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Blog Image

పంజాబ్‌పై హైదరాబాద్ విజయం

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRHలో అభిషేక్ శర్మ(66), క్లాసెన్(42), నితీష్(37), రాహుల్(33) పరుగులతో రాణించారు. దీంతో SRH 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసుకుంది. అటు పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్షల్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో SRH పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

Blog Image

తిరుపతిలో ముగిసిన సిట్ విచారణ

AP: ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఏర్పాటైన సిట్ విచారణ తిరుపతి జిల్లాలో ముగిసింది. 7 గంటల పాటు విచారణ జరిపిన సిట్ అధికారులు.. సెక్యూరిటీ వైఫల్యంతో పాటు పలు అంశాలను గుర్తించారు. దీనిపై ఈ రాత్రికే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Blog Image

90 ఏళ్ల వయసులో అంతరిక్షయానం

USకు చెందిన ఎడ్ డ్వైట్(90) అరుదైన ఘనత సాధించనున్నారు. అంతరిక్ష ప్రయాణం చేసిన అతిపెద్ద వ్యక్తిగా నిలవనున్నారు. ఈయన 1961లోనే వ్యోమగామి శిక్షణ తీసుకున్న తొలి నల్లజాతి వ్యక్తి. అప్పట్లో పలు కారణాలతో నాసాకు ఎంపిక కాలేదు. 63 ఏళ్ల తర్వాత అతనికి బ్లూ ఆరిజిన్ (జెఫ్ బెజోస్ కంపెనీ) అవకాశం కల్పించింది. ఇవాళ ఆయన మరో ఐదుగురితో కలిసి స్పేస్‌లోకి వెళ్లనున్నారు.

Blog Image

పోలీసులపై సిట్‌కు ఫిర్యాదు

AP: పోలీసులపై తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణి రమాదేవి సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటిలో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం తాడిపత్రి చేరుకున్న సిట్ అధికారులను రమాదేవి లీగల్ సెల్ టీంతో వెళ్లి కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని సిట్ అధికారులను కోరారు.

Blog Image

తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. సీఈసీ అనుమతి ఇవ్వడంతో ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో అత్యవసర విషయాలను మాత్రమే చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం షరతు విధించింది. సమావేశంలో పాల్గొన్న అధికారులు మీడియాతో మాట్లాడకూడదని తెలిపింది.

Blog Image

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

TG: రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వికారాబాద్‌ జిల్లాలోని యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. జంటుపల్లిలో పిడుగుపడి శ్రీనివాస్‌, లక్ష్మమ్మ మృతి చెందారు. బెన్నూరులో వెంకప్ప ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట, ప్యారడైజ్‌, చిలకలగూడ, అల్వాల్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, జవహర్‌నగర్‌, సుచిత్ర, జీడీమెట్ల, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

Blog Image

ఉద్యోగులకు బంపరాఫర్.. 8 నెలల జీతం బోనస్‌

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తన సిబ్బందికి బంపరాఫర్‌ అందించింది. ఎనిమిది నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంచనాలకు మించి లాభాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థ రికార్డుస్థాయిలో 1.98 బిలియన్‌ డాలర్ల వార్షిక నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో మార్చి ముగిసే సమయానికి ఎయిర్‌లైన్‌ నికర ఆదాయం 24 శాతం పెరిగి 2.7 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Blog Image

ఓటీటీకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్‌ ‍డేట్ అదేనా?

పృథ్వీరాజ్‌ సుకుమార్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ‘ఆడుజీవితం’. మార్చి 28న రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రిలీజై రెండు నెలలు గడిచినా ఇంకా ఓటీటీకి రాలేదు. ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ ఓటీటీ అనేదీ ఇంకా ఖరారు కాలేదు.

Blog Image

సాత్విక్ - చిరాగ్ జోడీదే థాయిలాండ్ ఓపెన్ టైటిల్

భారత పురుషుల డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ మళ్లీ అదరగొట్టింది. ఈ ద్వయం థాయిలాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. బ్యాంకాక్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 21-15, 21-15 తేడాతో చైనాకు చెందిన చెన్ బో యాంగ్-లియు యి జంటను చిత్తుచేసింది. థాయిలాండ్ ఓపెన్ విజేతగా నిలవడం ఈ జంటకు ఇది రెండోసారి.

Blog Image

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్!

భగభగ మండే ఎండలో బైక్‌పై ఎక్కడికైనా వెళ్లాలంటే నరకం కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలిచిపోయినప్పుడు చిరాకు వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ లిబర్టీ సిగ్నల్ వద్ద, మరొకటి ప్యాట్నీ సెంటర్ వద్ద గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేశారు. అయితే ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంటే ఇప్పుడు ఏర్పాటు చేసి ఏం లాభం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Blog Image

స్టెప్పులతో అదరగొట్టిన కొత్తగూడెం ఎస్పీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన పార్టీలో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ రోహిత్‌రాజ్ సరదాగా డ్యాన్స్ చేసి అలరించారు. నిత్యం కేసుల వేటలో బిజీగా ఉండే పోలీసు అధికారులు ఇలా తెలుగు పాటలకు స్టెప్పులు వేసి అదరహో అనిపించారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

Blog Image

ఇండోనేషియాలో 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!

ఇండోనేషియాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ యాక్సెస్‌ మెరుగుపరచాలనే లక్ష్యంతో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్, ఇండోనేషియా హెల్త్ మినిష్టర్ 'బుడి గునాడి సాదికిన్' ఈ రోజు ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇండోనేషియా నికెల్ వనరులను ఉపయోగించి ఈవీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. టెస్లా ఆ దేశంలో తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి కొన్నేళ్లుగా ఎదురు చూస్తూనే ఉంది.

Blog Image

రేపటి ఎన్నికల్లో ముఖ్య నాయకులు వీరే!

దేశంలో రేపు ఐదో దశ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు. వారిలో స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ కైసర్ గంజ్, లాలూ యాదవ్‌ కుమార్తె రోహిణి, చిరాగ్‌ పాశ్వాన్‌ ఉన్నారు. వీరిలో అందరి కళ్ళు రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీపైనే ఉన్నాయి.

Blog Image

నేనొక చిన్న మనిషిని: కేజ్రీవాల్

ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘‘నేను ఒక చిన్న మనిషిని. నాకు ఒక చిన్న పార్టీ ఉంది. మీ పిల్లల కోసం నేను స్కూల్స్ కట్టించినందుకే మోదీ నన్ను జైలులో పెట్టారు. నేను సీఎంగా ఢిల్లీలో 500 స్కూల్స్ కట్టించినపుడు..పీఎంగా మోదీ దేశంలో కనీసం 50వేల స్కూల్స్ కట్టించాలి’’ అని అన్నారు.

Blog Image

TCSను మించిన మరో టాటా కంపెనీ

టాటా గ్రూప్‌లోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను మరో టాటా కంపెనీ అధిగమించింది. ఇలా జరగడం పదేళ్లలో ఇదే తొలిసారి. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్‌ నికర లాభం రూ.12,434 కోట్లను టాటా మోటార్స్ రూ.17,407 కోట్ల నికర లాభంతో అధిగమించింది. టాటా మోటార్స్ లాభం గతేడాది రూ.5,407.79 కోట్లు ఉండగా 2024లో 221.89 శాతం పెరిగింది.

Blog Image

పోలీసులే దోషులు: మంత్రి అంబటి

ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న సిట్ బృందాన్ని కలిసి సత్తెనపల్లి సీఐపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరానని తెలిపారు. కొండపి గ్రామంలో ఘర్షణల కారణంగా ఊరంతా వలస వెళ్లారని చెప్పారు. వారిని వెనక్కి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిట్ విచారణలో పోలీసులే దోషులుగా తేలుతారని అంబటి ఆరోపించారు.

Blog Image

ఒడిశాలో మాదే అధికారం: రాజ్‌నాథ్

ఒడిశాలో తామే అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ పొత్తుగల ప్రభుత్వం 50 సంవత్సరాలు అధికారంలో ఉందని, బీజేపీ పార్టీ పొత్తుగల ప్రభుత్వం 25 సంవత్సరాలు అధికారంలో ఉందన్నారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

Blog Image

రాజమందిరంలా వైసీపీ కార్యాలయం.. ఎక్కడో తెలుసా?

విశాఖపట్నంలో వైసీపీ కార్యాలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. జూన్ 9న జగన్ విశాఖలోనే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో శరవేగంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘మహారాజ మందిరంలా పార్టీ కార్యాలయం ఉంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.