తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో మూడురోజుల పాటు నిర్వహించిన పద్మావతి పరిణయోత్సవాలు ఈరోజు సాయంత్రం ఘనంగా ముగిసాయి. చివరి రోజు శ్రీదేవి, భూదేవి వేర్వేరుగా రెండు వాహనాలపై రాగా మలయప్ప స్వామి గరుడ వాహనంపై వేదిక వద్దకు చేరుకున్నారు.ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఎదురుకోలు, పూబంతాట, వరణమయురం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.