పిడుగుపాటుకు ముగ్గురు మృతి
TG: రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. జంటుపల్లిలో పిడుగుపడి శ్రీనివాస్, లక్ష్మమ్మ మృతి చెందారు. బెన్నూరులో వెంకప్ప ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, బోయిన్పల్లి, మారేడుపల్లి, జవహర్నగర్, సుచిత్ర, జీడీమెట్ల, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.