shape

All News ChotaNews

కీలక పోరులో చెన్నైకి షాక్‌.. ప్లేఆఫ్స్‌కు బెంగళూరు

కీలక పోరులో చెన్నైకి షాక్‌.. ప్లేఆఫ్స్‌కు బెంగళూరు

కీలక పోరులో బెంగళూరు అదరగొట్టి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. చెన్నై ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెంగళూరు నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితం అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జ‌ట్టు 218 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది.

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..!

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..!

తెలుగు రాష్ట్రాలకు మండే ఎండల నుండి కాస్త రిలీఫ్ దక్కింది. గత కొద్దీ రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. అయితే ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది మే 24నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం: సీఎం యోగి

ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం: సీఎం యోగి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) మరో కొన్ని నెలల్లో భారత్‌లో విలీనమవుతుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. అయితే, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శనివారం పాల్ఘర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి ప్రసంగించారు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

బుజ్జికి వాయిస్ ఇచ్చింది ఎవ‌రంటే..?

బుజ్జికి వాయిస్ ఇచ్చింది ఎవ‌రంటే..?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్-నాగ్‌ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కల్కి 2898 ఏడీ. తాజాగా ఈ మూవీలో బుజ్జికి సంబంధించిన ఒక గ్లింప్స్‌ను విడుదల చేశారు. చాలా ఆస​‍క్తిగా కొనసాగిన ఈ వీడియోలో ఒక చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బుజ్జికి వాయిస్‌ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ ఇచ్చింది.

నాన్‌ వెజ్ వద్దు.. వెజే ముద్దు..!

నాన్‌ వెజ్ వద్దు.. వెజే ముద్దు..!

ఒకప్పుడు వెజ్ మీల్స్ ధరలు అందుబాటులో ఉండేవి. క్రిసిల్ సర్వే లెక్కల ప్రకారం 2022 డిసెంబర్ నుంచి.. ఈ ఏడాది ఏప్రిల్ వరకు చూస్తే వెజ్ ధరలు పెరిగాయి. గతంలో 70 నుంచి 80 రూపాయలు ఉన్న వెజ్ మీల్స్ ఇప్పుడు 180 రూపాయలకు చేరింది. నాన్ వెజ్‌లో కొవ్వు పదార్దాలు ఎక్కువ ఉండడంతో వెజ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

VIDEO.. అప్రమత్తంగా ఉండాలంటున్న నాగబాబు

VIDEO.. అప్రమత్తంగా ఉండాలంటున్న నాగబాబు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూటమి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ వీడియో సందేశం వెలువరించారు. కౌంటింగ్ ముగిసేదాకా మూడు పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పిఠాపురంలో నాగబాబు vs వర్మ..!

పిఠాపురంలో నాగబాబు vs వర్మ..!

పిఠాపురంలో సరికొత్త రాజకీయానికి తెరలేపినట్టు కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే..అక్కడ నెంబర్ 2 స్థానం కోసం ఇరువురు నేతల మధ్య పోరు సాగుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కోసం పిఠాపురం టికెట్‌ను త్యాగం చేసిన‌ వర్మకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతుంటే.. నాగబాబుకు సైతం నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే బాధ్యతలను ఇస్తారని జనసైనికులు నమ్ముతున్నారు.

మహేశ్‌తో మల్టీస్టారర్‌.. సుధీర్‌బాబు ఎమన్నారంటే?

మహేశ్‌తో మల్టీస్టారర్‌.. సుధీర్‌బాబు ఎమన్నారంటే?

నటుడు సుధీర్‌బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరోం హర’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన ఆయన పలు విషయాలు పంచుకున్నారు. ‘మహేశ్‌బాబుతో మల్టీస్టారర్‌ ఎప్పుడు?’ అని అడగ్గా.. అందుకు తానుకూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. మల్టీస్టారర్‌ గురించి తమ మధ్య ఇప్పటివరకు చర్చ జరగలేదని, ఏదోఒక రోజు అది సాధ్యం కావొచ్చన్నారు.

అదరగొట్టిన ఆర్సీబీ.. చెన్నైకి భారీ టార్గెట్

అదరగొట్టిన ఆర్సీబీ.. చెన్నైకి భారీ టార్గెట్

చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసి.. చెన్నై ఎదుట భారీ టార్గెట్ పెట్టింది. బెంగుళూరు బ్యాటర్లలో డుప్లెసిస్(54), కోహ్లీ(47), పటిదార్(41) రాణించారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ రెండు వికెట్లు తీయగా..శాంట్నర్, తుషార్ దేశ్‌పాండే తలో ఒక వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌ ఫలితంతోనే ప్లేఆఫ్స్‌ చివరి బెర్తు తేలనుంది.

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖుషబ్‌లో మినీట్రక్ లోయలో పడి ఐదుగురు చిన్నారులతో సహా 13 మంది మృతిచెందారు. ఒక కుటుంబం బన్నూ నుంచి సూన్ వ్యాలీకి వెళుతుండగా ట్రక్కు ఒక్కసారిగా మలుపు దగ్గర అదుపు తప్పి లోయలో పడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌లు వెంటనే చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పల్నాడులో భారీగా కేసులు నమోదు

పల్నాడులో భారీగా కేసులు నమోదు

పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ వర్గీయులపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. దాడులు, ఘర్షణలకు సంబంధించిన వీడియోల సాయంతో నిందితులను గుర్తిస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తల కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఘర్షణల సమయంలో తమ వారు లేపోయినా కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తున్నారు.

మరో రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ

మరో రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా ఐపీఎల్‌లో ఒకే వేదికలో 3000+రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ్టి మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. 3005 పరుగులతో కోహ్లీ టాప్‌లో ఉండగా… తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(వాంఖండే-2295), (డివిలియర్స్-1960) ఉన్నారు.

ప్రభాస్ చెప్పిన ‘బుజ్జి’ ఇదే!

ప్రభాస్ చెప్పిన ‘బుజ్జి’ ఇదే!

రెండు రోజులుగా సోషల్ మీడియాను ఊపు ఊపేసిన ‘బుజ్జి’ అంటే ఎవరో చెప్పేసింది ‘కల్కి’ మూవీ టీమ్. మూవీలో ఉపయోగించిన ఒక వాహనం పేరు బుజ్జి అని తెలిపింది.

‘హాని తలపెట్టాలనుకునే శత్రు దేశాలు ఆలోచించుకోండి’

‘హాని తలపెట్టాలనుకునే శత్రు దేశాలు ఆలోచించుకోండి’

నేడు హరియాణా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బలహీనమైన ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను మార్చగిలిగేదా? ఆర్టికల్ 370 గోడను బద్దలుకొట్టాం. జమ్మూకశ్మీర్‌లో ఇప్పుడు అభివృద్ధి మొదలైంది. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటంతో గత 70 ఏళ్లుగా భారత్‌ను ఇబ్బంది పెట్టిన పాకిస్థాన్ ఇప్పుడు బిచ్చమెత్తుకునే స్థితికి చేరింది. హాని తలపెట్టాలనుకునే శత్రు దేశాలు 100 సార్లు ఆలోచించుకోవాలి’’ అని మోదీ పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన ట్రాఫిక్ పోలీస్

నిబంధనలు ఉల్లంఘించిన ట్రాఫిక్ పోలీస్

సాధారణంగా ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తుంటారు. కానీ రూల్స్ పాటించాలని చెప్పే పోలీసులే రూల్స్ బ్రేక్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్ పడి ఉన్న రైల్వే గేటు వద్ద ప్రమాదకరంగా బైక్‌తో పట్టాలు దాటుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లక్నోలోని దిల్ కుషా రైల్వేగేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

పార్టీ మార్పుపై విజయశాంతి క్లారిటీ

పార్టీ మార్పుపై విజయశాంతి క్లారిటీ

పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేత విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. ‘‘దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర నిన్నటి పోస్టులో వ్యక్తపరిచాను. అవగాహన చేసుకునే తత్వంలేని కొందరు ఆ పోస్టుపై పార్టీ మార్పు అంటూ కథనాలు రాస్తున్నారు. అర్ధం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలం. ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పనిగా పెట్టుకున్నవారికి వివరించలేం’’ అని ట్వీట్ చేశారు.

బాధ్యతతో ఓటు వేయండి: రతన్ టాటా

బాధ్యతతో ఓటు వేయండి: రతన్ టాటా

ఈనెల 20న ముంబైలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబై వాసులకు కీలక విజ్ఞప్తి చేశారు. ముంబై వాసులంతా బాధ్యతతో ఓటేయాలని కోరారు. కాగా ఐదో దశలో ముంబైతో పాటు దేశంలోని 49 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

చైనాకు జెలెన్‌స్కీ అభ్యర్థన

చైనాకు జెలెన్‌స్కీ అభ్యర్థన

ఉక్రెయిన్ కోసం ఈ జూన్‌లో శాంతి సదస్సు నిర్వహిస్తామని స్విట్జర్లాండ్‌ ప్రకటించింది. ఈ సదస్సులో చైనా, గ్లోబల్‌ సౌత్‌ దేశాలు పాల్గొనాలని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. అలాగే తమది తటస్థ పక్షమని స్విట్జర్లాండ్ పునరుద్ఘాటించింది. చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించిన నేపథ్యంలో జెలెన్‌స్కీ స్పందన రావడం గమనార్హం.

వ్యాపారులకు కేంద్రం హెచ్చరిక

వ్యాపారులకు కేంద్రం హెచ్చరిక

ఎండాకాలంలో మామిడిపండ్లు విరివిగా దొరుకుతాయి. ఈ నేపథ్యంలో మామిడి కాయలను పండించేందుకు వ్యాపారులు కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(FSSAI) వ్యాపారులకు కీలక ఆదేశాలిచ్చింది. కాయలను పండించేందుకు కాల్షియం కార్బైడ్‌ను వినియోగించొద్దని హెచ్చరించింది. ఇది నిషేధమని పేర్కొంది. దాని స్థానంలో ఇథిలీన్ వాయువును వినియోగించాలంది.

దీపికా పదుకొణె కార్ల విలువ ఎంతో తెలుసా?

దీపికా పదుకొణె కార్ల విలువ ఎంతో తెలుసా?

హీరోయిన్‌ దీపికా పదుకొణె కార్లు చూస్తే షాకవ్వాల్సిందే. ఆడి క్యూ7–ధర రూ.80 లక్షలు. మెర్సిడెస్ మేబ్యాక్ S500–రూ.2.40 కోట్లు. ఆడి A8L-రూ.1.20 కోట్లు. రేంజ్ రోవర్ వోక్–రూ.1.40 కోట్లు. మినీ కూపర్ కన్వర్టిబుల్–రూ.45 లక్షలు. ఆడి A8L-రూ.1.20 కోట్లు. ఆడి A6-రూ.55 లక్షలు. BMW 5 సిరీస్-రూ.60 లక్షలు. పోర్షే కయెన్-రూ.1 కోటి. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందట.

తాడిపత్రికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్

తాడిపత్రికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్

అనంతపురం జిల్లా తాడిపత్రికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు చేరుకున్నాయి. చెన్నై నుంచి 120 మంది సభ్యుల బృందం వచ్చింది. ఇటీవల జరిగిన అల్లర్ల ఘటనపై రేపు సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ నేపథ్యంలో భద్రత కోసం భారీగా బలగాలను రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అక్కడ కేంద్ర బలగాలు, పోలీసుల పహారా మధ్య ప్రశాంత వాతావరణం ఉంది.

దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేశాడు!

దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేశాడు!

కృష్ణా జిల్లా మచిలీపట్నం బొర్రపోతుపాలెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు తన భార్య కాగిత శివ నాగరాణి(30)పై అనుమానంతో రోకలిబండతో తలపై కొట్టి కిరాతకంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేసి మచిలీపట్నం రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

బెంగళూరు, చెన్నై మ్యాచ్‌కు గేల్, రిషబ్ శెట్టి

బెంగళూరు, చెన్నై మ్యాచ్‌కు గేల్, రిషబ్ శెట్టి

చెన్నై, బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి హాజరై సందడి చేశారు. ఆ పిక్స్ వైరలవుతున్నాయి.

ముస్లిం రిజర్వేషన్ల కోసం పాకిస్థాన్ వెళ్ళండి: అస్సాం సీఎం

ముస్లిం రిజర్వేషన్ల కోసం పాకిస్థాన్ వెళ్ళండి: అస్సాం సీఎం

ముస్లిం రిజర్వేషన్లపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు కావాలని అడుగుతున్న బీహార్ మాజీ సీఎం, RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. ఆ రిజర్వేషన్ల కోసం పాకిస్థాన్ వెళ్లాలని అన్నారు. దేశంలో సమూల మార్పులు తీసుకురావడానికి, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు పరచడానికి బీజేపీని 400 ఓవర్లలో గెలిపించాలన్నారు.

మరోసారి మేడిగడ్డకు సీఎం రేవంత్

మరోసారి మేడిగడ్డకు సీఎం రేవంత్

కాళేశ్వరం ప్రాజెక్టు NDSA రిపోర్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్లు చేయాలా? లేదంటే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై చర్చించారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అంశాలను పరిశీలించాలని నిర్ణయించినట్టు సమాచారం.

కియారా పోస్ట్‌.. చచ్చిపోతున్నామంటూ కామెంట్స్

కియారా పోస్ట్‌.. చచ్చిపోతున్నామంటూ కామెంట్స్

హీరోయిన్ కియారా అద్వానీ తాజాగా ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది. మొదటిసారి రెడ్ కార్పెట్‌పై తన అందంతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఈ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు కొందరు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తే.. మరికొందరు మాత్రం చూడలేక చచ్చిపోతున్నామని కామెంట్స్ పెడుతున్నారు.

చైనాకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

చైనాకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గాజువాకకు చెందిన చుక్క రాజేశ్‌ 2021నుంచి విదేశాలకు మ్యాన్‌ పవర్‌ సప్లయ్‌ చేయడం మొదలుపెట్టాడు. ఏజెంట్‌ల సాయంతో 150మందిని బ్యాంకాక్‌ గుండా కంబోడియాకు పంపించి, అక్కడ చైనా కంపెనీలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు.ఈ ముఠా నుంచి తప్పించుకున్న బొత్స శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

25న అమెరికాకు టీమిండియా

25న అమెరికాకు టీమిండియా

T20 వరల్డ్ కప్ కోసం ఈ నెల 25న టీమిండియా అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం కొందరు ఆటగాళ్లు ఆ రోజు పయనం కానున్నట్లు సమాచారం. అలాగే ఫైనల్ అనంతరం ఈ నెల 27న మిగిలిన ఆటగాళ్లు యూఎస్ విమానం ఎక్కనున్నట్లు టాక్. తొలుత రోహిత్, హార్దిక్, సూర్య, బుమ్రా, పంత్, అక్షర్, అర్ష్‌దీప్, సిబ్బంది వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

రాజ్యాంగాన్ని రక్షించడమే మా లక్ష్యం: రాహుల్ గాంధీ

రాజ్యాంగాన్ని రక్షించడమే మా లక్ష్యం: రాహుల్ గాంధీ

రాజ్యాంగాన్ని రక్షించడమే తమ లక్ష్యమని ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎందుకంటే ఇది దేశ ప్రజల భవిష్యత్తు, కల, హృదయ స్వరం అని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసేస్తుందని, అందుకే మోదీని గెలిపించొద్దని పిలుపునిచ్చారు.

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు: IMD

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు: IMD

గత కొద్దీ రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఈ వర్షాలు ఇంకొన్ని రోజుల పాటు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.

స్ట్రాంగ్ రూమ్‌లో వైసీపీ నేతలు.. టీడీపీ ఆరోపణ

స్ట్రాంగ్ రూమ్‌లో వైసీపీ నేతలు.. టీడీపీ ఆరోపణ

AP: ఈవీఎంలు భద్రపరిచిన రూమ్‌లోకి వైసీపీ నేతలు ప్రవేశించారని ట్విట్టర్ వేదికగా టీడీపీ ఆరోపించింది. ‘‘విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూంలో వైసీపీ నేతలకు ఏం పని? స్ట్రాంగ్ రూమ్ తెరిచేటప్పుడు అన్ని పక్షాల నేతలకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఓటమి భయంతో వైసీపీ బరితెగించి వ్యవహరిస్తోంది. ఎన్నికల అధికారులు దీనిపై తక్షణమే స్పందించాలి’’ అని ట్వీట్ చేసింది.

‘అంతర్గత విషయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి’

‘అంతర్గత విషయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి’

దేశ అంతర్గత విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీఅధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్‌ సమస్యను ఎన్నికల్లో ఎక్కువగా తీసుకురావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి లోక్‌సభ ఎన్నికలు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు.

అభిమాని కోరిక తీర్చిన హీరోయిన్!

అభిమాని కోరిక తీర్చిన హీరోయిన్!

హీరోయిన్ నభా నటేష్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అలాగే నెట్టింట చిట్ చాట్ నిర్వహించి అభిమానులతో ముచ్చటిస్తోంది. తాజాగా, ఓ నెటిజన్ నభా నటేష్‌ను గోర్లు చూపించమని కోరాడు. దీంతో ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా అభిమాని కోరికను తీర్చింది. ‘‘కట్ చేయలేదు, ఏం చేయలేదు.. భరించండి’’ అని క్యాప్షన్ జత చేసి గోర్లను చూపిస్తున్న ఫొటో షేర్ చేసింది.

మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి అంటేనే భూ కబ్జాలు గుర్తుకు వస్తాయని అన్నారు. వివాదంలో ఉన్న ఆయన భూమి విషయంలో తన పేరును అనవసరంగా లాగుతున్నారని మండిపడ్డారు. తాను మనుషులను పంపించి బెదిరిస్తున్నాననే ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.

ప్రచారంలో ఎంపీ అభ్యర్థిపై కాల్పులు

ప్రచారంలో ఎంపీ అభ్యర్థిపై కాల్పులు

ప్రచారంలో ఎంపీ అభ్యర్థిపై కాల్పులు జరగడం కలకలం రేపింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్జీత్ సింగ్ ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. గుర్జీత్‌ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. కానీ ఓ కార్యకర్త చేతికి గాయం అయింది. దీంతో అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అమృత్‌సర్ నుంచి గుర్జీత్ సింగ్ వరుసగా రెండుసార్లు గెలిచి మూడోసారి బరిలో ఉన్నారు.

మహిళపై దాడి చేసిన ఎలుగుబంటి

మహిళపై దాడి చేసిన ఎలుగుబంటి

జూలోని జంతువులు కొన్ని సార్లు అనూహ్యంగా మనుషులపై దాడులు చేస్తుంటాయి. తాజాగా ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎన్‌క్లోజర్‌‌లో ఒక వ్యక్తి మరొక స్త్రీకి శిక్షణ ఇస్తాడు. స్త్రీ తన చేతిని పైకెత్తి ఎలుగుబంటికి ఆజ్ఞాపిస్తుండగా ఎలుగు బంటి మహిళపై దాడి చేసింది. పక్కన ఉన్న వ్యక్తులు ఎలుగు బంటిని కర్రతో కొట్టి తరిమేశారు.

థాయిలాండ్ ఓపెన్‌లో ఫైనల్స్‌కు సాత్విక్ జోడీ

థాయిలాండ్ ఓపెన్‌లో ఫైనల్స్‌కు సాత్విక్ జోడీ

థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ విభాగంలో భారత జంట సాత్విక్‌ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. తొలి రౌండ్‌ నుంచి దూకుడుగా ఆడుతున్న ఈ జంట సెమీస్‌లోనూ అదే జోరు కనబర్చి ఫైనల్‌కు చేరారు. నేడు జరిగిన సెమీస్‌లో సాత్విక్ జోడీ 21-11, 21-12 తేడాతో చైనాకు చెందిన మింగ్ చె లు-టాంగ్ కై వీపై విజయం సాధించింది.

మొదలైన వర్షం.. నిలిచిన మ్యాచ్

మొదలైన వర్షం.. నిలిచిన మ్యాచ్

బెంగళూరు, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్‌ వర్షం కారణంగా నిలిచిపోయింది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో మూడు ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి వర్షం మొదలైంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు మూడు ఓవర్లలో 31 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(19), డుప్లెసిస్(12) ఉన్నారు.

ముగిసిన ఐదో విడత ప్రచారం

ముగిసిన ఐదో విడత ప్రచారం

ఐదో విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో నేటితో ప్రచారం ముగిసింది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎల్లుండి ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి. యూపీ, మహారాష్ట్ర, బెంగాల్, బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, జమ్మూ, లద్దాక్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25న ఆరో విడత, జూన్ 1న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి.

హైదరాబాద్‌లో ఎయిర్ ట్యాక్సీలు?

హైదరాబాద్‌లో ఎయిర్ ట్యాక్సీలు?

TG: హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం ఎయిర్ ట్యాక్సీలు నడపనున్నట్లు డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ డ్రోగ్రో డ్రోన్స్ కో ఫౌండర్ శ్రీధర్ దన్నపనేని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తొలుత ఎమర్జెన్సీ సేవలకు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అగ్రి డ్రోన్స్‌తో వ్యవసాయ రంగంలో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.