shape

All News ChotaNews

విండోస్‌ 11 కొత్త అప్‌డేట్‌

విండోస్‌ 11 కొత్త అప్‌డేట్‌

విండోస్ 11ను మైక్రోసాఫ్ట్‌ మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతోంది. ఈ మేరకు కోపైలట్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఏఐ ఫీచర్లతో కూడిన అప్‌డేట్‌ను దశలవారీగా విడుదల చేస్తోంది. కృత్రిమ మేధ ఆధారిత కోపైలట్‌ చాట్‌బాట్‌ సహా పెయింట్‌, స్నిప్పింగ్‌ టూల్‌, ఫొటోస్‌, ఆర్‌జీబీ లైటింగ్‌ సపోర్ట్‌, ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ వంటి అప్లికేషన్లకు ఏఐతో కూడిన అప్‌డేట్లను అందిస్తోంది. దశలవారీగా ఇవి యూజర్లకు లభించనున్నట్లు తెలుస్తోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గోల్డ్ సీజ్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గోల్డ్ సీజ్

TS: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 670 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 40,40,100 ఉంటుందని అంచనా వేశారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

SAFF U19 Championship: నేపాల్‌పై భారత్ విజయం

SAFF U19 Championship: నేపాల్‌పై భారత్ విజయం

శాఫ్‌ అండర్‌-19 ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్‌లో 3-2 తేడాతో నేపాల్‌ను ఓడించింది. పెనాల్టీ షూటౌట్‌లో 2-2తో ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్న వేళ భారత ఆటగాడు మంగ్లెన్‌తాంగ్ కిప్‌జెన్ బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపి జట్టును విజయతీరాలకు చేర్చాడు. శనివారం జరిగే టైటిల్‌ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌ తలపడనున్నాయి.

118 ఏళ్ల రికార్డ్ బ్రేక్.!

118 ఏళ్ల రికార్డ్ బ్రేక్.!

పురుషులతో పోల్చితే తామేం తక్కువ కాదని సోనాలి ఘోష్ మరోసారి నిరూపించారు. 118 సంవత్సరాల చరిత్రను బ్రేక్ చేస్తూ ప్రకృతి ఒడిలో సాహసోపేతమైన ఉద్యోగం చేస్తున్న ఆమె గురించి పై వీడియోలో చూడండి.

ట్రెడిషనల్ డ్రెస్సులో సంయుక్త మీనన్

ట్రెడిషనల్ డ్రెస్సులో సంయుక్త మీనన్

మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ తాజాగా ట్రెడిషనల్ డ్రెస్సులో మెరిసిపోతోంది. ఈ పిక్స్‌ను తాను ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

రోహిత్ శర్మ మరో రికార్డ్

రోహిత్ శర్మ మరో రికార్డ్

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ సృష్టించాడు. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 6 సిక్సులతో రోహిత్ చెలరేగాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 550 సిక్సులు కొట్టిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ శర్మ 471 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకోగా.. గేల్ 548 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అటు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు రోహిత్ 551 సిక్సులు కొట్టాడు.

Video: రేవంత్ సమక్షంలో చేరికలు

Video: రేవంత్ సమక్షంలో చేరికలు

TS: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి రేవంత్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో జడ్పీటీసీ గౌరమ్మ-చంద్రయ్య, సింగిల్ విండో చైర్మన్ బి.శ్రీనివాసులు, ఎంపీటీసీలు ఆంజనేయులు, మంగమ్మ, సర్పంచ్ దేవేందర్, పలువురు కార్యకర్తలు ఉన్నారు.

‘జవాన్‌’ ఆఫర్‌.. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ

‘జవాన్‌’ ఆఫర్‌.. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ

‘జవాన్‌’ చిత్ర బృందం ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితంగా పొందొచ్చని సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టింది. ఈ ఆఫర్ గురు, శుక్ర, శనివారం మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. బుక్‌ మై షో, పేటీఎం మూవీస్‌, పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీపోలిస్‌ వెబ్‌సైట్లు/యాప్‌ ద్వారా చేసే ఆన్‌లైన్‌ బుకింగ్స్‌కే పరిమితం చేసింది.

ASIAN GAMES: డే 4 కంప్లీట్.. మనకు ఎన్ని మెడల్స్ అంటే

ASIAN GAMES: డే 4 కంప్లీట్.. మనకు ఎన్ని మెడల్స్ అంటే

ఏషియన్ గేమ్స్‌లో డే 4 కంప్లీట్ అయింది. ఈ రోజు మనోళ్ల హవా నడిచిందనే చెప్పాలి. మన ప్లేయర్లు ఈ రోజు 2 బంగారు పతకాలతో సహా.. మొత్తం 7 పతకాలు సాధించారు. దీంతో మనోళ్లు ఇప్పటివరకు సాధించిన పతకాల సంఖ్య 22కు చేరుకుంది. ఇందులో 5 గోల్డ్, 7 సిల్వర్, 10 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మనోళ్లు పతకాల పట్టికలో ఐదో స్థానంలో ఉన్నారు.

టెట్‌లో సత్తా చాటిన జీహెచ్‌ఎంసీ కార్మికుడు

టెట్‌లో సత్తా చాటిన జీహెచ్‌ఎంసీ కార్మికుడు

TS: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్లో ఓ జీహెచ్‌ఎంసీ కార్మికుడు సత్తా చాటాడు. జీహెచ్‌ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ సరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు బోడ నరేష్ పాసయ్యాడు. బీఏ, బీఈడీ, ఎంఏ తెలుగు చదివిన నరేష్ ఉద్యోగం రాకపోవటంతో హయత్‌నగర్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. టెట్‌ ఫలితాల్లో ఉత్తీర్ణతను సాధించడంతో అతని కుటుంబసభ్యులతో పాటు తోటి కార్మికులు అతడిని అభినందిస్తున్నారు.

తెలంగాణ టూరిజానికి మూడు జాతీయ అవార్డులు

తెలంగాణ టూరిజానికి మూడు జాతీయ అవార్డులు

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్‌ పాల్గొని అవార్డులు అందుకున్నారు. జనగామ జిల్లాలోని హస్తకళలకు ప్రసిద్ధి చెందిన పెంబర్తి, సిద్దిపేట జిల్లా గొల్లబామ చీరల కేంద్రంతో పాటు రంగనాయక కొండ, ప్రకృతి రమణీయ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న చంద్లాపూర్‌ గ్రామాలు కేంద్ర అవార్డులకు ఎంపికైన విషయం తెలిసిందే.

భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!

భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!

‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా కొన్ని దశాబ్దాల తరువాత భారత్‌లోకి కొత్త చీతాలు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. స్వల్ప వ్యవధిలోనే వాటిలో చాలా వరకు వివిధ కారణాలతో మృత్యువాతపడ్డాయి. అవి ఆఫ్రికా ఖండంలోని దక్షిణ దేశాలైన సౌతాఫ్రికా, నమీబియాకు చెందిన చీతాలు. అందుకే ఈసారి ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకొచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్‌ సెక్రటరీలకు రివర్షన్‌

ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్‌ సెక్రటరీలకు రివర్షన్‌

సచివాలయంలోని కొందరు సెక్షన్‌ అధికారులకు అసిస్టెంట్‌ సెక్రటరీలుగా కల్పించిన పదోన్నతుల్ని వెనక్కు తీసుకున్న ప్రభుత్వం వారిని ఇంచార్జిలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అసిస్టెంట్‌ సెక్రటరీల నుంచి రివర్షన్‌ పొందిన 50మంది సెక్షన్‌ ఆఫీసర్లను ఇంచార్జిలుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

‘జమిలి నివేదికపై కసరత్తు జరుగుతోంది’

‘జమిలి నివేదికపై కసరత్తు జరుగుతోంది’

జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్ రితురాజ్‌ అవస్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు ఇంకా తుది రూపు ఇవ్వలేదని..దీన్ని ఖరారు చేసేందుకు ఎలాంటి కాలవ్యవధి పెట్టుకోలేదని తెలిపారు. పోక్సో చట్టం, ఆన్‌లైన్‌ ఎఫ్‌ఐఆర్‌లపై నివేదికలను ఖరారు చేసి న్యాయ మంత్రిత్వశాఖకు పంపినట్టు చెప్పారు.

IND vs AUS: 2023లో ఎన్ని గెలిచారంటే…

IND vs AUS: 2023లో ఎన్ని గెలిచారంటే…

ఇండియా-ఆస్ట్రేలియా జట్లు 2023లో 6 వన్డే మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ఇండియా జట్టు 3 మ్యాచ్‌లు, ఆసీస్ జట్టు 3 మ్యాచ్‌లు గెలిచింది. ఇండియా గెలిచిన 3 మ్యాచ్‌లు కూడా బ్యాకప్ కెప్టెన్ల ద్వారానే రావడం గమనార్హం.

రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ భారీ ఫాగింగ్

రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ భారీ ఫాగింగ్

AP: రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ అధికారులు మరోసారి ఫాగింగ్ చేపట్టారు. గడిచిన 18 రోజులుగా ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున ఫాగింగ్ చేపట్టారు. జైలు చుట్టూ భారీ వృక్షాలు ఉండడంతో దోమల బాధ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు చంద్రబాబు జైలులో ఉండటంతో ఈ ఫాగింగ్‌కి ప్రాముఖ్యత ఏర్పడింది. ఇటీవల రిమాండ్‌లో ఉన్న ఓ యువకుడు డెంగ్యూ కారణంగా మృతి చెందడంతో చర్యలు చేపట్టారు.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో విలన్‌గా తమిళ డైరెక్టర్‌..!

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో విలన్‌గా తమిళ డైరెక్టర్‌..!

పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న మోస్ట్ అవేయిటెడ్‌ చిత్రాల్లో ఉస్తాద్‌ భగత్‌ సింగ్ ఒకటి. ఈ మూవీకి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్ పార్ధీబన్‌ విలన్‌గా నటించబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

అప్పుల పాలయ్యాను.. ఆత్మహత్యే దిక్కు!

అప్పుల పాలయ్యాను.. ఆత్మహత్యే దిక్కు!

కరీంనగర్: అప్పులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేశానని, నాలుగేళ్లు అయినా బిల్లులు రాలేదని రామడగు మండలం పందికుంట గ్రామసర్పంచ్ మొగుళ్ల ఎల్లయ్య ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామఅభివృద్ధి కోసం అప్పులపాలయ్యానని వాట్సాప్‌లో గ్రూప్‌లో పెట్టిన ఆడియో వైరల్‌గా మారింది. ఎన్నిసార్లు మీడియాకు చెప్పినా స్పందనలేదని, ఆత్మహత్యే దిక్కని వాపోయారు. పందికుంట సర్పంచ్ ఇటీవల రవీందర్ అకాలమరణంతో సర్పంచ్ బాధ్యతలు ఉపసర్పంచ్ ఎల్లయ్య బాధ్యతలు తీసుకున్నారు.

‘యూట్యూబ్‌తో జన జీవితాల్లో పరివర్తన తీసుకురావొచ్చు’

‘యూట్యూబ్‌తో జన జీవితాల్లో పరివర్తన తీసుకురావొచ్చు’

యూట్యూబ్ ఫ్యాన్‌ఫెస్ట్ ఇండియా 2023లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను మీ మధ్య తోటి యూట్యూబర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉంది. 15 సంవత్సరాల నుంచి, నేను కూడా యూట్యూబ్ ఛానెల్ ద్వారా దేశ ప్రజలకు కనెక్ట్ అయ్యి ఉన్నాను. మనం కలిసి, దేశంలోని ఎక్కువ సంఖ్యలో జనాల జీవితాల్లో పరివర్తన తీసుకురావచ్చ’ని చెప్పుకొచ్చారు.

IND vs AUS: ప్చ్.. పోరాడి ఓడిన టీమిండియా

IND vs AUS: ప్చ్.. పోరాడి ఓడిన టీమిండియా

ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఇండియా పోరాడి ఓడింది. ఆసీస్ విధించిన 353 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు బరిలోకి దిగిన రోహిత్ సేన 49.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. మ్యాక్సీ 4 వికెట్లు తీయగా, హేజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, గ్రీన్, సంఘా తలో వికెట్ తీసుకున్నారు. ఇండియా 2-1 తేడాతో 3 వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంది.

BANK HOLIDAYS: అక్టోబర్‌లో భారీగా బ్యాంక్ సెలవులు

BANK HOLIDAYS: అక్టోబర్‌లో భారీగా బ్యాంక్ సెలవులు

రానున్న అక్టోబర్ నెలలో బ్యాంకులకు అత్యధికంగా సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్‌ సెలవుల జాబితాలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు వంటి సాధారణ సెలవులు 7 ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. పండుగ లేదా గెజిట్ హాలిడేస్‌ 11 ఉన్నాయి. వీటిలో కొన్ని బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి.

రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ భారీ ఫాగింగ్

రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ భారీ ఫాగింగ్

AP: రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ అధికారులు ఫాగింగ్ చేపట్టారు. గడిచిన 18 రోజులుగా ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఫాగింగ్ చేపట్టారు. జైలు చుట్టూ భారీ వృక్షాలు ఉండడంతో దోమల బాధ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు చంద్రబాబు జైలులో ఉండటంతో ఈఫాగింగ్‌కి ప్రాముఖ్యత ఏర్పడింది. ఇటీవల రిమాండ్‌లో ఉన్న ఓ యువకుడు డెంగ్యూ కారణంగా మృతి చెందడంతో చర్యలు చేపట్టారు.

నవీన్‌ ఉల్‌ హాక్‌ సంచలన నిర్ణయం

నవీన్‌ ఉల్‌ హాక్‌ సంచలన నిర్ణయం

అఫ్ఘనిస్తాన్‌ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హాక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2023 వరల్డ్‌కప్‌ తర్వాత వన్డే ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతానని తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్‌ను ప్రొలాంగ్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. వన్డేలకు గుడ్‌బై చెప్పినా పొట్టి క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని అన్నాడు.

తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు

తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు

తెలంగాణలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైంది. నల్గొండ జిల్లా చండూరు డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోఫికేషన్ జారీ చేసింది. కొత్త రెవెన్యూ డివిజన్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నల్గొండ జిల్లాలోని చండూరు, మునుగోడు, గట్టుప్పల్‌, నాంపల్లి, మర్రిగూడ మండలాలతో చండూరు డివిజన్‌ ఏర్పాటైంది. ఇవన్నీ నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి బాలికల పీజీ హాస్టల్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 15 అగ్నిమాపక యంత్రాలతో అక్కడి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుమల చేరుకున్న కేంద్ర వైల్డ్ లైఫ్ బృందం

తిరుమల చేరుకున్న కేంద్ర వైల్డ్ లైఫ్ బృందం

ఆపరేషన్ చిరుతలో భాగంగా కేంద్ర వైల్డ్ లైఫ్ బృందం తిరుమలకు చేరుకుంది. అలిపిరి నడకదారిలో కేంద్ర వైల్డ్ లైఫ్ శాస్త్రవేత్త రమేష్ బృందం పరిశీలన చేసింది. నడకదారిలో ఇనుప కంచె ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా…అవసరమైన ప్రాంతాల్లో కంచె, అండర్ పాస్, ఫుట్ బ్రిడ్జ్ ఏర్పాటు పై పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉప్పాడ తీరంలో డాల్ఫిన్

ఉప్పాడ తీరంలో డాల్ఫిన్

విశాఖపట్నం: ఉప్పాడ తీరంలో డాల్ఫిన్ ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు. బుధవారం ఉప్పాడ-కాకినాడ బీచ్ మార్గం మధ్యలో ఉన్న కొత్త వంతెన సమీప తీరం వద్ద డాల్ఫిన్ మృతి చెంది కొట్టుకురావడంతో డాల్ఫిన్‌ను చూసేందుకు అనేకమంది బాలురుతీరారు. సముద్రంలోనే డాల్ఫిన్ మృతి చెంది ఉంటుందని, సముద్ర అలల దిశ ద్వారా ఉప్పాడ సమీప తీరానికి కొట్టుకొచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.

పాక్ జెండాతో వ్యక్తి హల్చల్

పాక్ జెండాతో వ్యక్తి హల్చల్

వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ టీమ్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి పాక్ జెండాతో హల్చల్ చేశాడు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. అతడిని బషీర్‌గా పోలీసులు తేల్చారు. ఈ నెల 29వ తేదీన పాక్ జట్టు న్యూజిలాండ్‌తో ఉప్పల్ వేదికగా వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి

పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్స్‌ను అలవోకగా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి. చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భోళా శంకర్‌’. ఇందులో ఓ కారును నడుపుతూ ఆయన చేసిన స్టంట్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ స్టంట్‌ చేసినందుకుగానూ శ్రీబద్రి రూ.50వేల పారితోషికం అందుకున్నారు. ఆమొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

లెనోవో కార్యాలయాల్లో ఐటీ సోదాలు

లెనోవో కార్యాలయాల్లో ఐటీ సోదాలు

భారత్‌లోని చైనాకి చెందిన లెనోవో కంపెనీ కార్యాలయాలలో ఐటీ సోదాలు నిర్వహించింది. ట్యాక్స్ ఎగవేత ఆరోపణల నేపథ్యంలో పుదుచ్చేరిలోని లెనోవా ఫ్యాక్టరీ, బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ కార్యాలయాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందిస్తూ.. ‘మేము అధికారులతో సహకరిస్తున్నాం. వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తాం’ అని లెనోవో యాజమాన్యం తెలిపింది.

IND vs AUS: అయ్యర్ గాన్.. ఇక కష్టమేనా

IND vs AUS: అయ్యర్ గాన్.. ఇక కష్టమేనా

ఇండియా-ఆస్ట్రేలియా మూడో వన్డేలో టీమిండియా అప్పుడే 6 వికెట్లను కోల్పోయింది. ఇండియా ఇంకా 69 బంతుల్లో 104 పరుగులు చేయాలి. 38.3 ఓవర్లకు 249/6 చేసింది. శ్రేయస్ అయ్యర్ (48) పరవాలేదనిపించి ఇప్పుడే పెవిలియన్ చేరాడు. జడేజా (9*) క్రీజులో ఉన్నాడు.

'గడపగడపకు' విజయోత్సవ బుక్‌లెట్‌ ఆవిష్కరించిన సీఎం

'గడపగడపకు' విజయోత్సవ బుక్‌లెట్‌ ఆవిష్కరించిన సీఎం

శ్రీకాకుళం: ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నేతృత్వంలో ఆయన నియోజకవర్గంలో 'గడపగడపకు-మన ప్రభుత్వం' కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన విజయోత్సవ బుక్‌లెట్‌ను సీఎం జగన్ చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 100 గ్రామ సచివాలయాల్లో 93,047 కుటుంబాలు సందర్శించి 248 రోజుల్లో పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే సీఎంకి వివరించారు.

ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి: స్టాలిన్

ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి: స్టాలిన్

సాధారణ ప్రజలతో ప్రభుత్వ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కోరారు. కార్యాలయానికి వచ్చిన వారిని సీట్లో కూర్చోమని చెప్పి వారి మాటలు వినాలన్నారు. ఇలాంటి చర్యలు ప్రజలకు ఎంతో సంతృప్తినిస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సంక్షేమం కోసం పాటుపడుతున్నారనే విషయాన్ని ప్రజలు గుర్తించేలా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల పట్ల నిజాయతీగా ఉండాలని సూచించారు.

114కి పెరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య

114కి పెరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య

ఇరాక్‌లో హమ్‌దానియా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగా జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 100 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 150 మందికిపైగా గాయపడ్డారు. తాజాగా మృతుల సంఖ్య 114కు చేరింది. వారిలోనూ కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పాడ్‌కాస్ట్స్‌‌కు గూగుల్ గుడ్‌బై

పాడ్‌కాస్ట్స్‌‌కు గూగుల్ గుడ్‌బై

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తమ పాడ్‌కాస్ట్స్‌ సర్వీసులకు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ఈ అప్లికేషన్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై యూట్యూబ్‌ మ్యూజిక్‌‌లోనే ఈ ఫీచర్‌ను అందించనుంది. అంటే పాడ్‌కాస్ట్‌ సేవలు పొందాలంటే యూట్యూబ్‌ మ్యూజిక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మైగ్రేషన్‌ టూల్స్‌ను సిద్ధం చేసి, ఏడాది చివరి నాటికి పాడ్‌కాస్ట్స్‌ సర్వీసును పూర్తిగా మూసివేయనుంది.

‘ప్రపంచమంతా సనాతన ఉత్సవాలు జరుపుకుంది’

‘ప్రపంచమంతా సనాతన ఉత్సవాలు జరుపుకుంది’

జీ20 నేపథ్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రపంచమంతా సనాతన ఉత్సవాలను ఢిల్లీలో జరుపుకుందని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి అన్నారు. చెన్నైలోని అన్నానగర్‌లో జరిగిన శ్రీ విద్యాధీశ తీర్థరు స్వామీజీ 45వ చాతుర్మాస్య ‘సనాతన ఉత్సవ్’ కార్యక్రమంలో మాట్లాడారు. భారత్ అధ్యక్షతన జీ20 సమ్మిట్ దేశాలు సనాతన విలువలను తెలుసుకోవడంతోపాటు సనాతన ధర్మం, వసుదైక కుటుంబం గురించి తెలుసుకున్నాయని చెప్పారు.

గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు

గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు

కోనసీమ: అలమూరు మండలం మడికి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. హైవే వద్ద ఉన్న ప్రధాన కాలువలో వినాయకుడిని నిమజ్జనం చేసే కార్యక్రమంలో అత్తిలి రాజేష్ అనే యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి ఈతకోట్టే సమయంలో గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ యనమదుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వరదల్లో కొట్టుకొచ్చిన మొసలి పిల్ల

వరదల్లో కొట్టుకొచ్చిన మొసలి పిల్ల

TS: హైదరాబాద్‌లో ఈరోజు కురిసిన భారీ వర్షానికి వరదలు వచ్చాయి. ఈ వరదల్లో ఖైరతాబాద్ చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల కొట్టుకొచ్చింది. నాలా వంతెన నిర్మాణం జరుగుతున్న చోట మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

IND vs AUS: ఇండియావి మూడు డౌన్…

IND vs AUS: ఇండియావి మూడు డౌన్…

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా మూడు వికెట్లను కోల్పోయింది. అర్ధ సెంచరీలు చేసిన కెప్టెన్ రోహిత్ (81), కోహ్లీ (56) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 30 ఓవర్లకు ఇండియా స్కోరు 185/3. గెలుపు కోసం ఇంకా 168 పరుగులు చేయాలి. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ ఒక్కడే మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇంకా 120 బంతులు మాత్రమే ఉన్నాయి.

చంద్రబాబు అవినీతిపరుడు: కేఏ పాల్

చంద్రబాబు అవినీతిపరుడు: కేఏ పాల్

చంద్రబాబు,లోకేష్‌పై కేఏ పాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఆయన ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు అవినీతిలో కుమారుడు లోకేష్‌కు కూడా భాగం ఉందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి చేశాడు కాబట్టి జైలు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ఆయనకు న్యాయవ్యవస్థపై నమ్మ​కం ఉంటే విచారణకు సహకరించాలని కేఏపాల్ పేర్కొన్నారు.

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

AP: మన్యం జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నారాయణపట్నం పరిధిలోని ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు జయరాజు, బాలరాజు, శివ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతులను మక్కువ మండలం విజయరామాపురం వాసులుగా గుర్తించారు.

గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ అకాడమీలో నవరాత్రి పండుగ కోసం గర్బా సాధన చేస్తున్న 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. తొలి రౌండ్‌ పూర్తయ్యాక నేలపై కుప్పకూలిపోయాడు. కాగా, ఆ విద్యార్థికి ఎలాంటి అంతర్లీన అనారోగ్యం లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

డీజే సౌండ్కు ఆగిన గుండె

డీజే సౌండ్కు ఆగిన గుండె

నాగర్ కర్నూలు: గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. డీజే సౌండ్ ధాటికి ఓ యువకుడి గుండె హఠాత్తుగా ఆగిపోయింది. పాలెంలోని ప్రియదర్శిని గణేష్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో పాల్గొన్న పానుగంటి మల్లేష్ (25) ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. బాధితుడిని హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సీబీఐ దర్యాప్తు చేస్తోంది: మణిపూర్ సీఎం

సీబీఐ దర్యాప్తు చేస్తోంది: మణిపూర్ సీఎం

విద్యార్థుల హత్యలను ప్రభుత్వం ఖండిస్తోందని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ తెలిపారు. ఈ కేసుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్‌గా ఉన్నాయని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసి, ఈ ప్రత్యేక కేసును దర్యాప్తు చేయడానికి సీబీఐ స్పెషల్ డైరెక్టర్, అతని బృందాన్ని పంపుతున్నట్లు చెప్పారన్నారు. ఎవరినీ విడిచిపెట్టమని సీఎం పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్‌రావు ఫైర్

కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్‌రావు ఫైర్

వికారాబాద్ జిల్లా తాండూర్ టీఆర్ఎస్ సభలో కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశం మొత్తం వెనుకబడడానికి కారణం A-1 కాంగ్రెస్ అయితే, A-2 బీజేపీ. బీజేపీ వాళ్లు గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 8 కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తే.. తెలంగాణకు ఎందుకు మొండిచేయి చూపిందో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలి’’ అని అన్నారు.

మేనకాగాంధీ ఆరోపణల్లో నిజం లేదు: ఇస్కాన్

మేనకాగాంధీ ఆరోపణల్లో నిజం లేదు: ఇస్కాన్

పాలివ్వని ఆవులను ఇస్కాన్‌ నిర్వహకులు కబేళాలకు తరలిస్తున్నారని బీజేపీ ఎంపీ, జంతు హక్కుల ఉద్యమకారిణి మేనకాగాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఇస్కాన్ వర్గాలు ఖండించాయి. ఎంపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆమె తప్పుడు ఆరోపణలు చేశారని ఇస్కాన్ జాతీయ అధికార ప్రతినిధి యుధిష్టర్ గోవిందదాస్ తెలిపారు. నిజానికి ఆమె అనంతపూర్ గోశాలను సందర్శించలేదని చెప్పారు.

'అవయవదానంపై అవగాహన ఉండాలి'

'అవయవదానంపై అవగాహన ఉండాలి'

కర్నూల్: ప్రతి సంవత్సరం అవయవాలు దొరకక ఎంతో మంది చనిపోతున్నారని డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి అన్నారు. యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన వారు, బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను వేరే వాళ్లకు దానం చేయడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చన్నారు. ఈ సందర్భంగా అవయవదానం చేసేందుకు.. http:// notto.abdm.gov.in/pledge-registry/ నోటో ఆర్గాన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.