పోలీసులే దోషులు: మంత్రి అంబటి
ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న సిట్ బృందాన్ని కలిసి సత్తెనపల్లి సీఐపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారనని తెలిపారు. కొండపి గ్రామంలో ఘర్షణల కారణంగా ఊరంతా వలస వెళ్లారని చెప్పారు. వారిని వెనక్కి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిట్ విచారణలో పోలీసులే దోషులుగా తేలుతారని అంబటి ఆరోపించారు.