శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా గోల్డ్ సీజ్
TS: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 670 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 40,40,100 ఉంటుందని అంచనా వేశారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.