shape

Telangana ChotaNews

Blog Image

ప్రధానిని వెనక్కి నెట్టిన పవన్ కళ్యాణ్

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో..పవన్ కల్యాణ్ సోషల్ మీడియా అకౌంట్ మోస్ట్ పాపులర్ పొలిటికల్ అకౌంట్‌గా నిలిచింది. 2వ స్థానంలో ప్రధాని మోదీ, 3వ స్థానంలో రాహుల్ గాంధీ, 4వ స్థానంలో సీఎం జగన్, 7వ స్థానంలో కేటీఆర్ ఉన్నారు.

Blog Image

‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత

‘నేచురల్స్ ఐస్‌క్రీమ్’ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్(70) కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్‌ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను స్థాపించి ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ.400 కోట్లు.

Blog Image

ఉద్యోగులకు 'కాగ్నిజెంట్' వార్నింగ్

ప్రముఖ టెక్ దిగ్గడం కాగ్నిజెంట్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకొచ్చి పనిచేయాలని ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఈఓ రవి కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కంపెనీలో మొత్తం 3.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా సుమారు 2.54 లక్షల మంది భారత్‌లోనే పనిచేస్తున్నట్లు సమాచారం.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్‌

AP: శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తుల రద్దీ పెరగడంతో టోల్‌గేట్‌ మలుపు వద్ద ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. పెద్ద ఎత్తున వచ్చిన వాహనాలు శివపార్వతుల విగ్రహాల వద్ద నిలిపివేయడంతో ఆలయానికి వచ్చి తిరిగి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Blog Image

మారనున్న రణబీర్‌-సాయి పల్లవి ‘రామాయణం’ టైటిల్‌

రణబీర్‌ కపూర్, సాయి పల్లవి జంటగా నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ టైటిల్‌ మారబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. లీగల్‌ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మరో వర్కింగ్ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు బీటౌన్ నుంచి వార్తలొస్తున్నాయి. ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ప్రస్తుతం దానిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Blog Image

సభలో గందరగోళం... మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్‌, అఖిలేష్‌

ఉత్తరప్రదేశ్‌లోని ఒక బహిరంగ సభలో తొక్కిసలాట పరిస్థితులు తలెత్తడంతో మీటింగ్‌ మధ్య నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ వెళ్లిపోయారు. సభా వేదికను చేరుకోవడానికి ఇటు ఎస్పీ, అటు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో భద్రతాపరమైన సమస్యలు వస్తాయని రాహుల్, అఖిలేష్‌లను పోలీసులు హెచ్చరించడంతో వారు ప్రసంగించకుండా మధ్యలోనే వెనుదిరిగారు.

Blog Image

స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ అసహనం

స్టార్ స్పోర్ట్స్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ అసహనం వ్యక్తం చేశారు. తాను గోప్యంగా మాట్లాడుతున్న మాటలను రికార్డ్ చేయొద్దని కోరినప్పటికీ, రికార్డ్ చేశారని మండిపడ్డారు. రికార్డ్ చేయడమే కాదు దాన్ని టెలికాస్ట్ కూడా చేశారన్నారు. ఇలా కంటెంట్ మీద దృష్టి పెట్టి ప్రతీది టెలికాస్ట్ చేస్తే..క్రికెటర్లు, క్రికెట్, అభిమానుల మధ్య ఉన్న బంధం విచ్చిన్నమవుతుందన్నారు. ఉన్న మంచి భావాన్ని అలానే ఉంచుకోవాలని సూచించారు.

Blog Image

బ్రిటన్ రాజు కంటే రిషిసునాక్ దంపతుల సంపద ఎక్కువ!

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు బ్రిటన్ రాజు చార్లెస్‌ III కంటే ఎక్కువని సండే టైమ్స్ నివేదిక తెలిపింది. కింగ్‌ చార్లెస్‌ సంపద గత ఏడాది కాలంలో 600 మిలియన్‌ పౌండ్ల నుంచి 610 మిలియన్‌ పౌండ్లకు చేరుకుంది. సునాక్‌ దంపతుల సంపద మాత్రం 529 మిలియన్‌ పౌండ్ల నుంచి 651 మిలియన్‌ పౌండ్లకు పెరిగింది.

Blog Image

ఈ ఏడాది వర్షాలు ఎక్కువే: ఐఎండీ

భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ సీజన్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని తెలిపింది. లానినా కారణంగా ఏర్పడిన పరిస్థితులతో పసిఫిక్ మహా సముద్రం చల్లబడటం వల్ల ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని వివరించింది. భారత వ్యవసాయ రంగం రుతుపవనాలపై ఆధారపడి ఉంది. రుతుపవనాల ప్రభావం దేశ ఆహార రంగంపై కూడా ప్రభావం చూపుతాయి.

Blog Image

‘పుష్ప-2’ కోసం హైదరాబాద్‌లో మలేషియా సెట్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప-2’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..ఓ కీలక సన్నివేశం కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మలేషియా సెట్ వేసినట్లు సమాచారం. కాగా ఇటీవల విడుదలైన ‘పుష్ప-పుష్ప’ సాంగ్ మూవీపై అంచనాలను పెంచిన విషయం తెలిసిందే.

Blog Image

కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి: ఈసీ ఆదేశాలు

TG: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఈసీ మెమో జారీచేసింది. పోలింగ్ రోజున కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ తెచ్చిన పార్టీకి. తెలంగాణ సాధించిన నేతకు ఓటు వేశాను. మీరందరూ కూడా ఓటువేయాలి’’ అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత జి. నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈసీ చర్యలు చేపట్టింది.

Blog Image

ధోనీపై కమల్‌ ప్రశంసలు

హీరోలు క్రికెటర్ల గురించి మాట్లాడినా.. క్రికెటర్లు- హీరోలు ఏదైనా వేదికపై కలిసినా సినీ, క్రీడా అభిమానులకు అదో ఆనందం. తాజాగా ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ తన కొత్త సినిమా భారతీయుడు- 2 ప్రచారంలో భాగంగా ‘స్టార్స్‌ స్పోర్ట్స్‌’ ఛానల్‌కు వెళ్లి.. సినిమా సంగతులు పంచుకున్నారు. తన అభిమాన క్రికెటర్‌ ఎం.ఎస్‌. ధోనీని కొనియాడారు. అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

Blog Image

రాహుల్, మమతపై విరుచుకుపడిన మోదీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో వీరిపై విమర్శలు గుప్పించారు. రాహుల్‌ను ఉద్దేశిస్తూ..షెహజాదా మావోయిస్టు భాష వాడటం వల్ల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ పారిశ్రామికవేత్త అయిన పెట్టుబడులు పెట్టేందుకు 50సార్లు ఆలోచిస్తారన్నారు.ఒక వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి మమత సామాజిక, మత సంస్థలను బెదిరిస్తోందని ఆరోపించారు.

Blog Image

ఎమ్మెల్యేల సవాళ్ల పర్వం

తెలంగాణలో రాజకీయాలు కాస్త హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ల మధ్య భూమి విషయమై సవాళ్ల పర్వం మొదలైంది. మేడ్చల్‌లోని సుచిత్రా ల్యాండ్ తనది కాదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే లక్ష్మణ్ రాజీనామా చేయాలని మల్లారెడ్డి ఛాలెంజ్ చేశారు. దీనిపై లక్ష్మణ్‌ స్పందిస్తూ.. సవాల్‌ను స్వీకరిస్తున్నానని, రాజీనామా ఎవరు చేస్తామో చూద్దామని వ్యాఖ్యానించారు.

Blog Image

వ్యవసాయంలో అంకురాలు దూసుకెళ్తున్నాయ్‌..!

అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు వల్ల తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య 7000కు పైగా పెరిగాయని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) అధ్యక్షుడు జవారె గౌడ వెల్లడించారు. తొమ్మిదేళ్లలో వ్యవసాయరంగ కేటాయింపులు రూ.30వేల కోట్ల నుంచి రూ.1.3లక్షల కోట్లకు చేరగా.. 4% వృద్ధిని సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు ఆర్థిక మద్దతు అందించినట్లు తెలిపారు.

Blog Image

తాడిపత్రిలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

AP: ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక దాడులపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాడిపత్రిలో నమోదైన 7 కేసుల వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో ఘర్షణలు జరిగిన ప్రాంతాలను సిట్ బృందం పరిశీలించింది. దీనిపై త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించనుంది.

Blog Image

ముత్యాలమ్మ అమ్మవారి ఫోటో వైరల్

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైన ముత్యాలమ్మ ఆలయంలో తీసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఓ భక్తుడు ఫోటో తీయగా అందులో అమ్మవారి కుడి చేతి నుంచి వెలుగు వచ్చినట్లు కనిపించింది. దీంతో పలువురు ఆ వెలుగును అమ్మవారి మహిమగా భావిస్తూ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

Blog Image

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి రెండే కారణాలు: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో కేటీఆర్ మాట్లాడుతూ.. రెండు కారణాల చేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. క్షేత్రస్థాయి వరకు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం తొలి తప్పని పేర్కొన్నారు. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం రెండో తప్పని అన్నారు.

Blog Image

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

AP: నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకాయి. ఈ నెల 31నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ మొదటి వారంలో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. ఈ నెల 24 నాటికి వాయు గుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. దీని వల్ల కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Blog Image

TSPSC కొత్త పేరు ఇదేనా!

తెలంగాణ స్టేట్‌లో ఇప్పటివరకు వాడుతున్న టీఎస్(TS) పేరును టీజీ(TG)గా మార్చాలంటూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యాలయాల నేమ్ బోర్డులపై TSకి బదులుగా.. TG అని రాయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ సంస్థలు టీఎస్‌కు బదులుగా టీజీని రాస్తున్నాయి. అయితే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేరును కూడా TGPSCగా మార్చనున్నారని తెలుస్తోంది.

Blog Image

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల వివరాలు ఇవే..

Blog Image

భారత్‌తో వాణిజ్యంపై పాక్ కీలక వ్యాఖ్యలు

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై భారత్‌ అధిక సుంకాలు విధించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్‌ తెలిపారు. అందుకే ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం నిలిచిపోయిందన్నారు. ‘‘పుల్వామా ఘటన తర్వాత పాక్‌ నుంచి వచ్చే దిగుమతులుపై 200శాతం సుంకం విధించాలని భారత్‌ నిర్ణయించింది. కశ్మీర్‌ బస్సు సేవలను నిలిపివేసింది. సరిహద్దు వెంట వాణిజ్య కార్యకలాపాలను ఆపేసింది’’అని ఇషాక్‌ పేర్కొన్నారు.

Blog Image

చైనా దిగుమతులపై అమెరికా కీలక ప్రకటన

చైనాలో తయారయ్యే విద్యుత్‌ వాహనాలు, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమీనియంపై కొత్త టారిఫ్‌లు విధిస్తామని బైడెన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల ముందు అమెరికా తీసుకున్న ఈ చర్యతో ఇరు దేశాల మధ్య సంఘర్షణ పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో బైడెన్, ట్రంప్‌ మధ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.

Blog Image

ఆ రెండు పార్టీలు కలిస్తే బీజేపీ ఓటమి ఖాయం: నారాయణ

ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్ళు కన్నయ్యపై దాడులు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందన్నారు. 400సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని.. ఏపీలో ప్రభుత్వం మారుతుందన్నారు. ప్రస్తుతం ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోదీనే అంటూ తీవ్రంగా విమర్శించారు.

Blog Image

ఓ వైపు విద్యావంతుడు.. మరోవైపు బ్లాక్‌మెయిలర్: కేటీఆర్

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి విజయం కోసం కృషిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కోరారు. భువనగిరిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలనూ పరిశీలించండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ వైపు ఉన్నత విద్యావంతుడు.. మరోవైపు బ్లాక్‌‌మెయిలర్‌, లాబీయింగ్‌ చేసే అభ్యర్థి ఉన్నారు. ఎవరు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి’’ అని సూచించారు.

Blog Image

ఎంపీగా గెలిస్తే బాలీవుడ్‌ను వదిలేస్తా: కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో విజయం సాధిస్తే సినిమాలకు దూరంగా ఉంటారా? అనే ప్రశ్నకు ఆమె అవుననే సమాధానమిచ్చారు. ‘‘బాలీవుడ్‌లో నేను విజయం సాధించా. నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. మండి ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నా. ఒక ఉత్తమ ఎంపీగా ప్రజలకు నావంతు కృషి చేస్తా’’ అని చెప్పారు.

Blog Image

ఓయో IPO దరఖాస్తు ఉపసంహరణ!

తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్‌ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రీఫైనాన్సింగ్‌ వలన ఆర్థిక వివరాల్లో మార్పు జరుగుతుండడం వల్ల IPO దరఖాస్తు ఆమోదం కోసం ప్రయత్నించడంలేదని సమాచారం.

Blog Image

మారనున్న రెండు జిల్లాల పేర్లు

తెలంగాణ ప్రభుత్వం రెండు జిల్లాల పేర్లను మార్చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టబోతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాకు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి సూచనాప్రాయంగా చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.

Blog Image

కేబినెట్ నిర్వహణకు ఈసీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే ఈ సమావేశంలో చర్చించాలని షరతు విధించింది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించరాదని పేర్కొంది. ఎన్నికల్లో పాల్గొన్న అధికారులెవరూ సమావేశంలో పాల్గొనకూడదని తెలిపింది.

Blog Image

పంచన్‌ లామా ఎక్కడ: అమెరికా

అమెరికా-చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు కావాల్సిన పంచన్‌ లామా ఆచూకీని బీజింగ్‌ ప్రకటించాలని వాషింగ్టన్‌ డిమాండ్‌ చేసింది. సురక్షితంగా ఉన్నాడా?లేడా? అన్న విషయాన్ని వెల్లడించాలని కోరింది. హిమాలయాల్లో పంచన్‌ లామా అదృశ్యమై 29 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యు మిల్లర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.