ఆ రెండు పార్టీలు కలిస్తే బీజేపీ ఓటమి ఖాయం: నారాయణ
ఆర్ఎస్ఎస్ వాళ్ళు కన్నయ్యపై దాడులు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందన్నారు. 400సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని.. ఏపీలో ప్రభుత్వం మారుతుందన్నారు. ప్రస్తుతం ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోదీనే అంటూ తీవ్రంగా విమర్శించారు.