shape

National ChotaNews

Blog Image

మారనున్న రెండు జిల్లాల పేర్లు

తెలంగాణ ప్రభుత్వం రెండు జిల్లాల పేర్లను మార్చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టబోతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాకు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి సూచనాప్రాయంగా చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.

Blog Image

కేబినెట్ నిర్వహణకు ఈసీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే ఈ సమావేశంలో చర్చించాలని షరతు విధించింది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించరాదని పేర్కొంది. ఎన్నికల్లో పాల్గొన్న అధికారులెవరూ సమావేశంలో పాల్గొనకూడదని తెలిపింది.

Blog Image

పంచన్‌ లామా ఎక్కడ: అమెరికా

అమెరికా-చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు కావాల్సిన పంచన్‌ లామా ఆచూకీని బీజింగ్‌ ప్రకటించాలని వాషింగ్టన్‌ డిమాండ్‌ చేసింది. సురక్షితంగా ఉన్నాడా?లేడా? అన్న విషయాన్ని వెల్లడించాలని కోరింది. హిమాలయాల్లో పంచన్‌ లామా అదృశ్యమై 29 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యు మిల్లర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

మన సమాచారం సురక్షితమేనా?

ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు పెరగడంతో అదే స్థాయిలో సైబర్‌ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. ఇటీవల ఐటీ వ్యవస్థ లోపాల కారణంగా కోటక్‌ మహీంద్రా బ్యాంకుపై ఆర్‌బీఐ కొన్ని ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు తమ సమాచారం క్షేమమేనా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Blog Image

ఉత్తరప్రదేశ్‌కు మీరు ఏమిచ్చారు?: అమిత్ షా

యూపీలోని జౌన్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. వారు యూపీకి చేసిందేమి లేదని అన్నారు. ‘‘రాహుల్ గాంధీని, అఖిలేష్ యాదవ్‌ను నేను అడుగుతున్నా.. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యూపీకి ఏం చేశారు. మీరు పదేళ్లలో యూపీకి రూ.4.90లక్షల కోట్ల నిధులిస్తే, మేము రూ.19.11కోట్ల నిధులు ఇచ్చాం’’ అని అన్నారు.

Blog Image

తిరుపతి జిల్లాలో సిట్‌ విచారణ

AP: ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో పలుచోట్ల సిట్‌ బృందం విచారణ చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎస్వీయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు చంద్రగిరి మండలం కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లెలో సిట్‌ అధికారులు పలువురిని విచారించారు. కూచువారిపల్లెలో వైసీపీ అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్‌మెన్‌ ఈశ్వర్‌, గ్రామస్థులను అధికారులు విచారించారు. రామిరెడ్డిపల్లె సర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిని సిట్‌ అధికారులు పరిశీలించారు.

Blog Image

F&Oపై ఎందుకింత మోజు..?

దేశంలో పొదుపు మొత్తాలు F&O (ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌) ట్రేడ్‌లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్‌ అన్నారు. సీఐఐ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. నష్టాలు వస్తున్నా చిన్న మదుపర్లు తగ్గడం లేదని, పెట్టుబడిపై తగిన పరిజ్ఞానం అవసరం అని గుర్తుచేశారు. దీనిపై తగిన పరిమితులు నిర్దేశించాలని పేర్కొన్నారు.

Blog Image

మరో గ్యారంటీ ఇస్తున్నా: మోదీ

దేశ ప్రజలకు ప్రధాని మోదీ మరో గ్యారంటీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు చెబుతున్నా. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. మోదీ మరో గ్యారంటీ ఇస్తున్నారు. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అనంతరం అవినీతిపరులు తమ పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

Blog Image

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: సీపీఐ నారాయణ

AP: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతోందన్నారు. పోలీసుల వైఫల్యంతోనే ఏపీలో అల్లర్లు జరుగుతున్నాయని తెలిపారు. మోదీ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా ఆయన కూతురు కవితను, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అందులో ఇరికించారన్నారు. మోదీ పతనం ప్రారంభమైందని.. బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు.

Blog Image

భూ వివాదంపై సీఎంను కలుస్తా: మల్లారెడ్డి

TG: సుచిత్ర పరిధిలోని సర్వే నెం-82లోని భూ వివాదంలో మాజీమంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భూవివాదం విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు. పోలీసులు మా వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్‌ను కలిసి వివరిస్తామని తెలిపారు.

Blog Image

ఆప్‌ నిరసనపై మాలీవాల్‌ రియాక్షన్ ఇదే

ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి ఆరోపణల వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. పార్టీ ఆదివారం నిర్వహించ తలపెట్టిన నిరసనను ఉద్దేశించి ఆమె తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చాం. 12 ఏళ్ల తర్వాత ఈరోజు.. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసి, ఫోన్‌ను ఫార్మాట్‌ చేసిన నిందితుణ్ని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా?’’ అని ట్వీట్ చేశారు.

Blog Image

పద్మావతి యూనివర్సిటీలో మారణాయుధాలు లభ్యం

AP: తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో మారణాయుధాలు బయటబడ్డాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో డాగ్ స్క్వాడ్‌తో బాంబ్ డిస్పోజబుల్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారీగా కత్తులు, హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా యూనివర్సిటీలో మారణాయుధాలు దొరకడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Blog Image

భారీగా పెరిగిన చికెన్ ధరలు

TG: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.290 నుంచి రూ.310లు పలుకుతోంది. స్కిన్‌తో అయితే రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. ఇక బోన్‌లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.520కు అమ్ముతుండటం గమనార్హం. కోళ్ల ఉత్పత్తి తగ్గడం, అలాగే ఈ వారంలో వర్షాలు పడటం వలన ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.

Blog Image

ధోనికి ఏం చేయాలో తెలుసు: కోచ్

ఈ సీజన్‌ తర్వాత ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు విపరీతంగా వచ్చాయి. దీనిపై చెన్నై బౌలింగ్‌ కన్సల్టెంట్ ఎరిక్ సైమన్స్ కీలకవ్యాఖ్యలు చేశాడు.‘‘ఎంఎస్‌డీకి ఎప్పుడు ఏంచేయాలో తెలుసు. ప్రి-సెషన్‌ ప్రాక్టీస్‌ సమయంలోనూ అతడి బ్యాటింగ్‌ చూశా. బంతిని హిట్టింగ్‌ చేయడంలో ఉత్సాహం చూపించాడు. అలాగే మ్యాచుల్లోనూ చూశాం. తన భవిష్యత్తుపై పూర్తి అవగాహనతో ఉంటాడు. తప్పకుండా నిర్ణయం తీసుకుంటాడు’’ అని చెప్పుకొచ్చాడు.

Blog Image

ఆప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఢిల్లీలోని ఆప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లకుండా ఆప్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం ముందు బైఠాయించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరసన తెలిపారు. మరోవైపు డీడీయూ మార్గ్‌లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఐటీవో మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Blog Image

విదేశాల్లో ఉద్యోగాలంటే నమ్మవద్దు ..సజ్జనార్ ట్వీట్ !

నిరుద్యోగులందరూ విదేశాల్లో ఉద్యోగాలంటే గుడ్డిగా నమ్మవద్దని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. డేటాఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలని కాంబోడియాకు తీసుకెళ్లి అక్కడ చైనా కంపెనీలు వారిని నిర్బంధించి జాబ్‌ ఫ్రాడ్స్‌, ఫెడెక్స్‌ కొరియర్‌ స్కామ్స్‌, క్రిప్టో కరెన్సీ మోసాలు చేయాలని బెదిరింపులకు దిగుతున్నాయన్నారు. తాజాగా ఏపీలో విశాఖపట్నం పోలీసులు ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్‌ చేశారన్నారు.

Blog Image

ఏపీలో టీడీపీదే అధికారం: చింతా మోహన్

ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు. సీఎం జగన్‌కు పడాల్సిన ఓట్లన్నీ చంద్రబాబుకు పడ్డాయని చెప్పారు. తామే అధికారంలోకి వస్తున్నామని వైసీపీ నేతలు చెప్పడం.. కేవలం వారి ఊహాగానాలేనని తెలిపారు. ఎన్నికల వేళ వైసీపీ రూ.4-5 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Blog Image

హీరోయిన్‌ను వెంబడించిన కుక్క.. తప్పిన ప్రమాదం

హీరోయిన్ కియరా అద్వానీ తాజగా ఓ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ముంబై ఎయిర్‌పోర్టు‌లో కారు దిగి నడుచుకుంటూ వస్తుండగా అక్కడ ఓ కుక్క ఆమెను వెంబడించింది. దీనిని గమనించి కాస్త టెన్షన్ పడుతూ మెల్లిగా నడిచింది. ఆమెకు కుక్క అడుగు దూరంలో ఉన్నా సెక్యూరిటీ వాళ్లు గమనించలేదు. తర్వాత వారు కుక్కను తరిమేసి కియారాను కాపాడారు. ప్రస్తుతం ఈన్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Blog Image

VIDEO: ర్యాలీగా బయలుదేరిన ఆప్ నేతలు

ఆప్ అధినేత కేజ్రీవాల్, పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ ఆఫీస్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఆ కార్యాలయాన్ని ముట్టడిస్తామని నిన్ననే కేజ్రీవాల్ చెప్పిన సంగతి తెలిసిందే.

Blog Image

రాళ్లను పెంచుకుంటున్న సౌత్ కొరియన్స్!

కల్చరల్ పవర్ హౌజ్‌గా పిలువబడే సౌత్ కొరియా గ్లోబల్ ట్రెండ్ సెట్టర్ గాను గుర్తింపు పొందింది. ఎమోషనల్ సపోర్ట్ కోసం కుక్కలు, పిల్లులు పెంచుకుంటాం. కానీ సౌత్ కొరియన్స్ మాత్రం పెట్ స్టోన్స్, పెట్ రాక్స్‌ను పెంచుకుంటున్నారు. మీటితో కొద్ది సేపు స్పెండ్ చేస్తే ఒత్తిడి, ఆందోళన దురమవుతాయని వారు నమ్ముతున్నారు. వాటి కోసం ప్రత్యేకమైన స్థలం కేటాయిస్తూ.. భద్రంగా చూసుకుంటున్నారు.

Blog Image

‘చిన్నా’ తర్వాత చాలా కథలు విన్నా: సిద్ధార్థ్‌

గతేడాది ‘చిన్నా’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో సిద్ధార్థ్‌. ఇప్పుడు తన 40వ సినిమాని ప్రకటించారు. శ్రీ గణేష్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. ఈసందర్భంగా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ‘చిన్నా’ తర్వాత చాలా కథలు విన్నా. గణేష్‌ చెప్పిన ఈ కథ నాకు బాగా నచ్చింది. మా ఇద్దరి కలయికలో ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే సినిమా వస్తుందనే నమ్మకముంది’’ అన్నారు.

Blog Image

ఆప్‌ను నాశనం చేయాలనుకుంటోంది: కేజ్రీవాల్

ఆప్‌ను పూర్తిగా నాశనం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో మాట్లాడుతూ.. దాని కోసం ‘ఆపరేషన్ జాదు’ను ప్రారంభించారని చెప్పారు. ఆప్ ఎదుగుతోందని, ప్రపంచం మొత్తం ఆప్ గురించి మాట్లాడుతోందని ప్రధాని అన్నట్లు కొందరు తనతో చెప్పారన్నారు. రాబోయే రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో ఆప్ గట్టి పోటీ ఇస్తుందనే.. తమను నాశనం చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Blog Image

‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీబీఐ, ఈడీలను మూసేస్తాం’

కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయ కారణాలతో మాత్రమే ఉపయోగించుకుంటుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ, సీబీఐని మూసివేయాలని ప్రతిపాదిస్తానంటూ వ్యాఖ్యానించారు. ‘‘మోసానికి పాల్పడితే ఆ విషయాన్ని ఐటీశాఖ చూసుకుంటుంది. ఆ మాత్రానికి సీబీఐ ఎందుకు? ప్రతి రాష్ట్రంలోనూ ఏసీబీ ఉంది. కావాలంటే దానిని ఉపయోగించుకోవచ్చు’’అని అఖిలేశ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Blog Image

వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు!

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు రానున్నాయి. ‘పిన్నెడ్ మెసేజ్ ప్రివ్యూ’.. దీంతో చాట్‌లో యూజర్లు తాము పిన్ చేసిన మీడియా ఫైల్‌ను ఓపెన్ చేయకుండానే చూసే వీలుంటుంది. అంటే పిన్ చేసిన దగ్గరే థంబ్‌నైల్ రూపంలో ప్రివ్యూ కనిపిస్తుంది. ఇక ‘డిస్క్రిప్షన్ ఫర్ కమ్యూనిటీ గ్రూప్ చాట్స్’.. దీంతో ఫీచర్‌తో కమ్యూనిటీ గ్రూపుల్లో అడ్మిన్స్ తమ గ్రూప్ వివరాల్ని యాడ్ చేసుకోవచ్చు.

Blog Image

బెండతో బోలెడు లాభాలు

బెండకాయలో తక్కువ కెలరీలు ఎక్కువ ఫైబర్ ఉండటంతో బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యానికి మెరుగపరచడానికి దోహదపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బెండలో క్యాన్సర్ తగ్గించే ఔషధ గుణాలతోపాటు జీర్ణక్రియ సాఫీగా కొనసాగడానికి తోడ్పడుతుంది. బెండలోని విటమిన్ ఎ, సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలు రాకుండా నియంత్రిస్తాయి. ఇందులో లభించే ఫోలిక్ యాసిడ్ గర్భిణీల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

Blog Image

‘దేవర’ నుంచి మరో పోస్ట్

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవర’ సినిమా నుంచి ఇవాళ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. దీంతో ఈ పాట రాసిన రచయితల పేర్లతో మూవీ టీం ఓ పోస్ట్ విడుదల చేసింది.

Blog Image

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి: ఎర్రబెల్లి

TG: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూర్‌, తొర్రూరు గ్రామాల్లో పర్యటించిన ఆయన కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే అన్నదాతలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Blog Image

Viral Video: భూమి మీద పడిన భారీ ఉల్క

స్పెయిన్‌, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. ఆ సమయంలో వచ్చిన వెలుగు పగలును తలపించింది. ఒక్కసారిగా చోటు చేసుకొన్న ఈ ఘటనతో ప్రజలు ఆశ్చర్యపోయారు. వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉల్క ఎక్కడ పడిందో కచ్చితంగా తెలియడం లేదు.

Blog Image

VIDEO: ధోనీకి వీడ్కోలు పలికిన ఐపీఎల్!

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఈ సీజన్‌తో తన ఐపీఎల్ కెరీర్‌కు గుడ్ బై చెప్పబోతున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధోనీపై ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. దీంతో నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్.. ధోనీ చివరి మ్యాచ్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

Blog Image

వందేభారత్ రైలు కింద పడిన ఆవు

రైల్వే ట్రాక్‌పై ఒక ఆవు పడుకుని ఉంది. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న వందేభారత్ రైలు లోకోపైలెట్ దూరం నుంచే ఆవును గమనించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో రైలు వేగం తక్కువగా ఉండడంతో ఆవు దగ్గరకి వచ్చి ఆగడంతో అది ప్రాణాలతో బయటపడింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Blog Image

కుమ్ముకుంటూ అమ్మాయిలపైకి ఆవులు.. వీడియో వైరల్

ఢిల్లీలోని ఓ వీధిలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే రెండు ఆవులు కుమ్ముకుంటూ షాప్ బయట కూర్చున్న ముగ్గురు యువతులపైకి హఠాత్తుగా దూసుకెళ్లాయి. కిందపడ్డ ఓ యువతిని గిట్టలతో తొక్కాయి. స్థానికులు ఆవులను చెదరగొట్టి వారిని కాపాడారు. షాప్ ముందున్న సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యం నెటిజన్లను అవాక్కు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వెంటనే వైరల్ అయింది.

Blog Image

హిజ్రాల మృతదేహాల కలకలం

AP: కర్నూల్ సమీపంలో ఉన్న గార్గేయపురం చెరువులో మూడు హిజ్రాల మృతదేహాలు బయటపడ్డాయి. మొదట రెండు శవాలు.. తరువాత మరొక శవం బయటపడింది. దీంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు మిస్టరీగా మారిన ఆ మృతదేహాల గురించి విచారణ చేస్తున్నారు. గ్రూప్ తగాదాల వల్ల జరిగిందా లేక ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Blog Image

ఖర్గే చెప్పినా వినను: అధీర్ రంజాన్

మమతా బెనర్జీపై అధీర్ రంజన్ విమర్శలు చేయడంపై ఖర్గే స్పందించిన విషయం తెలిసిందే. దానిపై అధీర్ స్పందించారు. ‘‘నన్ను, కాంగ్రెస్‌ను రాజకీయంగా అంతం చేయాలనుకునేవారి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ సానుకూలంగా మాట్లాడలేను. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తకోసం పోరాడుతా. వారిపక్షానే మాట్లాడుతా. మమతా రాజకీయ నైతికతను ప్రశ్నిస్తా. ఒకవేళ ఖర్గే నాకు వ్యతిరేకంగా స్పందించినా.. నేను మాత్రం కాంగ్రెస్‌ కార్యకర్తలకోసమే మాట్లాడతా’’ అని చెప్పుకొచ్చారు.

Blog Image

వాటర్ ప్రూఫ్‌తో బెస్ట్ 5G ఫోన్..

ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శామ్‌సంగ్ గెలాక్సీ ఏ34 స్మార్ట్‌ ఫోన్‌ అతి తక్కువ ధరకే వాటర్‌ ప్రూఫ్‌ మొబైల్‌‌ను మార్కెట్‌లో అందుబాటులో తెచ్చింది. దీని ధర రూ.24,499కు అందుబాటులో ఉంది. గతంలో దీని ధర 30,999 ఉండేది. శామ్‌సంగ్ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డు సహాయంతో కొనుగోలు చేస్తే మరో వెయ్యి రూపాయల తగ్గింపును పొందవచ్చు.

Blog Image

ఇది చూస్తే ఫలితాలేంటో అర్థమవుతోంది: ప్రధాని

జనాల ఉత్సాహం చూస్తుంటే జూన్ 4న ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అర్థమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో మాట్లాడుతూ.. ‘బీజేపీ కార్యకర్తగా చాలా ఏళ్లు పనిచేశా. అప్పట్లో ఎన్నికల ర్యాలీకి ఉదయం 11 గంటలకు ఎవరూ రాకపోయేవారు. కానీ, ఈరోజు నేను ఇక్కడ భారీ జనసమూహాన్ని చూస్తున్నాను. సంతోషంగా ఉంది. ఈ లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి’ అని చెప్పుకొచ్చారు.

Blog Image

ఐదో విడతలో పోటీ చేసే ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, బీజేపీ అగ్రనాయకులు రాజ్​‌నాథ్‌‌సింగ్, స్మృతిఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్‌ప్రతాప్ రూడీ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌గాంధీ బరిలో దిగగా..లక్నో నుంచి రాజ్‌నాథ్‌సింగ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, ముంబై నార్త్‌ స్థానం నుంచి పీయూష్ గోయల్ పోటీ చేస్తున్నారు.

Blog Image

ఢిల్లీలో హై టెన్షన్.. ఆప్ నేతల అరెస్ట్

ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ కార్యాలయం, పలు కీలక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆప్ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Blog Image

ఆసక్తిరేపుతున్న ‘చందూ ఛాంపియన్‌’ ట్రైల‌ర్‌

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ మూవీ ‘చందూ ఛాంపియన్‌’. కబీర్‌ఖాన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

Blog Image

ధరణిపై దూకుడు పెంచిన సర్కార్..

తెలంగాణ సెక్రటేరియట్‌లో సమావేశమైన ధరణి కమిటీ.. భూసమస్యల పరిష్కారానికి రేవంత్‌ సర్కార్‌కు పలు కీలక సూచనలు చేసింది. జూన్ 4లోపు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న లక్ష ఫిర్యాదులను పరిష్కరించాలని నిర్ణయించింది. 33 జిల్లాల్లో ధరణి సమస్యలపై రెండులక్షల 45వేల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండగా.. లక్షన్నర కంప్లైంట్‌లను పరిష్కరించినట్లు ధరణి కమిటీ పేర్కొంది. ఈ సమావేశంలో చైర్మన్‌ కోదండరెడ్డి, కమిటీ మెంబర్లు, అధికారులు పాల్గొన్నారు.

Blog Image

బుక్ చేస్తే 24 గంటల్లో ఇంటికి..

నీటి ట్యాంకర్‌ బుక్‌ చేసిన 24 గంటల్లో సరఫరా చేసే విధానం అందుబాటులోకి వచ్చినట్లు జలమండలి ప్రకటించింది. ఇక నుంచి 3-4 రోజులపాటు నిరీక్షణ ఉండదని పేర్కొంది. నీటి ఎద్దడి నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చిలో డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేక ఇబ్బందులు ఎదురవడంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. ట్యాంకర్‌ అవసరమయ్యేవారు 155313కు ఫోన్‌ చేసి బుక్‌ చేసుకోవచ్చునని తెలిపింది.

Blog Image

కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

TG: హైదరాబాద్ వాసులను నిత్యం వేధిస్తున్న వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీలెవల్ కార్ పార్కింగ్(ఎంఎల్‌పీ) కాంప్లెక్స్ పనులు పూర్తి కావొచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ విధానాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్‌ అన్నారు.

Blog Image

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి చాలా మంది క్యూలైన్‌లో బారులుతీరారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది.

Blog Image

15 శాతం స్థానికేతర కోటా యథాతథం

కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఇతర ఉన్నత విద్య కోర్సుల్లో గతంలాగే ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఏపీ విద్యార్థులూ కన్వీనర్‌ కోటాలోని 15% నాన్‌లోకల్‌ సీట్లకు పోటీపడి దక్కించుకోవచ్చు. ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల అనంతరం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. జూన్‌ 2 లోపు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ వెలువరించినందువల్ల ప్రవేశాలకు ఏపీ విద్యార్థులూ అర్హులేనని వివరించారు.

Blog Image

సిక్స్ ప్యాక్‌తో వస్తున్న ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ త్వరలో ‘గం..గం..గణేశా’ సినిమాతో రాబోతున్నాడు. ఆనంద్ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్‌గా కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాణంలో ఉదయ్ శెట్టి దర్శకత్వంలో రాబోతుంది. మే 31న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఆనంద్ తన సిక్స్‌ప్యాక్ బాడీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో తెగ వైరల్ అవుతుంది.

Blog Image

'జరగండి' పాటపై కియారా షాకింగ్ కామెంట్స్!

హీరోయిన్ కియారా అడ్వానీ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ‘గేమ్ ఛేంజర్’లోని ‘జరగండి’ పాట షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ‘‘ఈ పాట షూటింగ్ 10 రోజుల పాటు జరిగింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట కోసం డైలీ 3 గంటల పాటు రిహార్సల్స్ చేశాను. రామ్‍చరణ్‍, నేను అన్ని స్టెప్‍లను మ్యాచ్ చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది’’ అని తెలిపింది.